పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి జగన్.. పరిశీలించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం.. 11 గంటలకు పోలవరం చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేశారు. అనంతరం హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వ్యూపాయింట్ నుంచి నదీ ప్రవాహ మార్గాన్ని పరిశీలించారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ను పరిశీలించారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్ స్పిల్వే పైకి చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటోల ద్వారా... పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. గేట్ల అమరిక, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ నుంచి వరద నీరు వెళ్తున్న తీరును తెలియజేశారు. స్పిల్ వేలోని 23వ క్రస్ట్ గేటు నుంచి పనుల పురోగతి, స్పిల్ ఛాన్లోకి వరద ప్రవాహాన్ని సీఎం జగన్ పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యాం చేరుకొని పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. దిగువ కాఫర్ డ్యాం పనుల పురోగతిని ఇంజినీర్లు వివరించారు.
పోలవరం నిర్మాణ పనులపై అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. 2023 నాటికి ఎర్త్ కం ర్యాక్ఫిల్ డ్యాం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పనుల నాణ్యత పరిశీలనకు ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశించారు. 50 ఆవాసాల్లోని నిర్వాసితులను తరలించాలన్న సీఎం జగన్.. వేగంగా నిధులు, అనుమతులు తెచ్చేందుకు మరో అధికారిని నియమించాలన్నారు. ఖర్చు చేసిన రూ.2200 కోట్లు రాబట్టేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: