ETV Bharat / state

కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్టు - విజయనగరం వార్తలు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 6.2 కిలోల గంజాయి పట్టుబడింది. నెల్లూరు జిల్లా నుంచి అరకు వచ్చిన ముగ్గురు యువకులు, తిరుగు ప్రయాణంలో గంజాయి కొనుగోలు చేసి, కారులో తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుల్ని అరెస్టు చేసి, కారు సీజ్​ చేశామన్నారు.

కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్టు
కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్టు
author img

By

Published : Jun 17, 2020, 9:49 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 6.2 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మంగళవారం సాయంత్రం అరకు వచ్చారు. తిరిగి ప్రయాణంలో గంజాయి కొనుగోలు చేశారు. యువకులు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా... అనుమానాస్పదంగా ఉన్న మూడు ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అందులో 6.2 కిలోల గంజాయి లభ్యం అయిందని పోలీసులు తెలిపారు.

యువకులు అరకు ప్రాంతంలో 15 వేల రూపాయలకు గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కారు సీజ్​ చేశామన్నారు. వీరిపై ఎండీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 6.2 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మంగళవారం సాయంత్రం అరకు వచ్చారు. తిరిగి ప్రయాణంలో గంజాయి కొనుగోలు చేశారు. యువకులు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా... అనుమానాస్పదంగా ఉన్న మూడు ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అందులో 6.2 కిలోల గంజాయి లభ్యం అయిందని పోలీసులు తెలిపారు.

యువకులు అరకు ప్రాంతంలో 15 వేల రూపాయలకు గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కారు సీజ్​ చేశామన్నారు. వీరిపై ఎండీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : ముగిసిన బడ్జెట్​ సమావేశాలు..15 బిల్లులకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.