ETV Bharat / state

కోడి పరిశ్రమ కార్మికులను ఆదుకోవాలని నిరసన - Protest to support workers at vizianagaram news

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అర్ధాంతరంగా కోడి పిల్లల పరిశ్రమలను మూసివేయటంతో కార్మికులు ఆందోళనకు దిగారు.

Protest to support workers
రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాలని నిరసన
author img

By

Published : Sep 22, 2020, 9:32 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో శ్రీనివాస్ కోడి పిల్లల పరిశ్రమలో ఒక యూనిట్ మూసివేయటంతో కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు రావలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని నినదించారు. పరిశ్రమలో ఒక యూనిట్​లో ఉన్న 22 మందిని విధులకు రావద్దని చెప్పటం దారుణమని సీఐటీయూ ఉపాధ్యక్షులు సూర్యనారాయణ విమర్శించారు. వారికి ఇవ్వాల్సిన పీఎఫ్, బకాయిలను చెల్లించాలని.. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి ప్రకటన లేకుండా సిబ్బందిని తొలగించటం అన్యాయమని.. దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నర్సింగ్​రావు, సుందరరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో శ్రీనివాస్ కోడి పిల్లల పరిశ్రమలో ఒక యూనిట్ మూసివేయటంతో కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు రావలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని నినదించారు. పరిశ్రమలో ఒక యూనిట్​లో ఉన్న 22 మందిని విధులకు రావద్దని చెప్పటం దారుణమని సీఐటీయూ ఉపాధ్యక్షులు సూర్యనారాయణ విమర్శించారు. వారికి ఇవ్వాల్సిన పీఎఫ్, బకాయిలను చెల్లించాలని.. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి ప్రకటన లేకుండా సిబ్బందిని తొలగించటం అన్యాయమని.. దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నర్సింగ్​రావు, సుందరరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రఘురామకృష్ణరాజుపై స్పీకర్​కు ఫిర్యాదు చేస్తా: నందిగం సురేశ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.