కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకూ చేదోడు వాదోడుగా నిలవాలనుకున్నారు.. విజయనగరం పట్టణానికి చెందిన హోప్ గివింగ్ సంస్థ సభ్యులు. విజయనగరంలోని మురికివాడలు, శివారు కాలనీల్లోని వీధులను శుభ్రం చేసేందుకు శ్రీకారం చుట్టారు. వీధులను శుభ్రం చేయటంతో పాటు చెత్తాచెదారం తొలగించటం, మురుగు కాల్వల వద్ద బీచ్లింగ్ పౌడర్ చల్లటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కార్మికులకు కొంతమేర పనిభారం తగ్గించే క్రమంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హోప్ గివింగ్ సంస్థ సభ్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: వ్యాధి లక్షణాలు గుర్తిస్తే.. వెంటనే పరీక్షలు చేయాలి: సీఎం