విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట, వెంకటరాజపురం, బాసంగి గ్రామాల్లో.. గజరాజులు తిష్టవేశాయి. పంట పొలాల్లో తిరుగుతూ రైతులను భయపెడుతున్నాయి.
అంతేగాక గ్రామాల సమీపంలోకి రావటంతో అందరు ఆందోళనకు చెందుతున్నారు. కోమరాడ, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తూ.. తోటపల్లి ప్రాజెక్టు గుండా జియ్యమ్మవలస మండలంలోకి ఏనుగులు ప్రవేశించాయి. అప్రమత్తమైన అటవీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. పొలం పనులకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి. ఓ వైపు కోవిడ్ ..మరో వైపు గుట్టలుగా చెత్త