ETV Bharat / state

'కరోనా బాధితులను క్వారంటైన్ సెంటర్​కు తరలించాలి'

విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మ రాజుపేట గ్రామంలోని యువకులు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేపట్టారు. కరోనా బాధితులను క్వారంటైన్ సెంటర్​కు తరలించాలని.. రిజిస్ట్రేషన్ చేసిన వారికి వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Aug 1, 2020, 5:07 PM IST

vizianagaram
కరోనా బాధితులు క్వారెంటైన్ సెంటర్ తరలించాలి

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి ఎదుట సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన యువకులు నిరసన తెలిపారు. తమ గ్రామంలో 24 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని... మరో వంద మందికి పరీక్షలు చేసేందుకు రిజిస్టర్ చేశారని వెల్లడించారు. అయినా పరీక్షలు జరపలేదని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికి వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులను క్వారంటైన్ సెంటర్​కు తరలించాలని కోరారు.

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి ఎదుట సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన యువకులు నిరసన తెలిపారు. తమ గ్రామంలో 24 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని... మరో వంద మందికి పరీక్షలు చేసేందుకు రిజిస్టర్ చేశారని వెల్లడించారు. అయినా పరీక్షలు జరపలేదని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికి వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులను క్వారంటైన్ సెంటర్​కు తరలించాలని కోరారు.

ఇదీ చదవండి విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.