ETV Bharat / state

రేషన్ ఇచ్చేందుకు​ డీలర్ల కుర్చీ పాట్లు

author img

By

Published : Jun 3, 2020, 5:45 PM IST

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు విడతల్లో ఉచిత రేషన్ సరఫరా చేస్తున్నాయి. రేషన్​ సరఫరాకు బయోమెట్రిక్ విధానం అమలుతో వేలిముద్ర వేయాలంటే.. సిగ్నల్ తప్పనిసరి. విజయనగరం జిల్లా భోగాపురంలో సిగ్నల్​ సమస్యతో రేషన్​ డీలర్లు కుర్చీ పాట్లు పడ్డారు. ప్రజలు రేషన్ కోసం గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.

రేషన్​ డీలర్ల కుర్చీ పాట్లు
రేషన్​ డీలర్ల కుర్చీ పాట్లు


పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న సరకులను నిర్ణీత సమయానికి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్​ డీలర్లు పనిచేస్తున్నారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల సరకుల పంపిణీలో జాప్యం జరుగుతుంది. రేషన్​ దుకాణాల వద్ద గంటల తరబడి ప్రజలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రజలకు రేషన్ సరకులు అందిస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల సిగ్నల్​ లోపించడంతో డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో బుధవారం ఉదయం నుంచి సిగ్నల్ రాకపోవడంతో... డీలర్లు కూర్చీ పాట్లు పడ్డారు. కూర్చీలు ఎక్కి సిగ్నల్​ కోసం ప్రయత్నించారు.

ఇదీ చదవండి : 'రెడ్​ క్రాస్... కరోనా నివారణ చర్యలు ప్రశంసనీయం'


పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న సరకులను నిర్ణీత సమయానికి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్​ డీలర్లు పనిచేస్తున్నారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల సరకుల పంపిణీలో జాప్యం జరుగుతుంది. రేషన్​ దుకాణాల వద్ద గంటల తరబడి ప్రజలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రజలకు రేషన్ సరకులు అందిస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల సిగ్నల్​ లోపించడంతో డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో బుధవారం ఉదయం నుంచి సిగ్నల్ రాకపోవడంతో... డీలర్లు కూర్చీ పాట్లు పడ్డారు. కూర్చీలు ఎక్కి సిగ్నల్​ కోసం ప్రయత్నించారు.

ఇదీ చదవండి : 'రెడ్​ క్రాస్... కరోనా నివారణ చర్యలు ప్రశంసనీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.