ETV Bharat / state

పిడుగు పాటుకు మూగజీవాల మృత్యువాత

author img

By

Published : Jun 4, 2020, 2:40 PM IST

పిడుగుపాటుకు రెండు ఎద్దులు, ఒక గేదె మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కురుపాం మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన పశువులకు సంబంధించి తనకు పరిహారం చెల్లించాలని బాధిత రైతు కోరుతున్నాడు.

vizianagaram
పిడుగు పాటుకు 2 దిక్కు ఎద్దులు, ఒక గేదె మృతి…

విజయనగరం జిల్లా కురుపాం మండలం గోటివాడ గ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పెద్దగా ఉరుములు మెరుపులతో వరసగా పలుచోట్ల పిడుగులు పడ్డాయి. సమీపంలో ఉన్న పొలంలో తిమ్మక శంకర్ రావు అనే గిరిజన రైతుకు చెందిన రెండు దుక్కిటెడ్లు పిడుగులు పడి అక్కడికక్కడే మృతి చెందాయి. అలాగే జియ్యమ్మవలస మండలం పిప్పలభద్ర గ్రామంలో ఓ రైతుకి చెందిన పాడి గేదె మృత్యువాత పడింది.

విజయనగరం జిల్లా కురుపాం మండలం గోటివాడ గ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పెద్దగా ఉరుములు మెరుపులతో వరసగా పలుచోట్ల పిడుగులు పడ్డాయి. సమీపంలో ఉన్న పొలంలో తిమ్మక శంకర్ రావు అనే గిరిజన రైతుకు చెందిన రెండు దుక్కిటెడ్లు పిడుగులు పడి అక్కడికక్కడే మృతి చెందాయి. అలాగే జియ్యమ్మవలస మండలం పిప్పలభద్ర గ్రామంలో ఓ రైతుకి చెందిన పాడి గేదె మృత్యువాత పడింది.

ఇది చదవండి రాష్ట్రంలో మరో 98 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.