ETV Bharat / state

చమురు ధరల పెంపుపై విజయనగరంలో ఏఐటీయూసీ ధర్నా

author img

By

Published : Jun 15, 2020, 2:14 PM IST

డీజిల్​, పెట్రోల్​పై ధరలు పెంచి కేంద్రం ప్రజలను దోచుకుంటున్నారని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. చమురు ధరల పెంపునకు వ్యతిరేకంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్​ వద్ద నిరసన చేపట్టారు. ప్రపంచ దేశాలన్నీ రూ. 50 లోపే అమ్ముతుంటే మనదేశంలో అందుకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు.

aituc students protest in vijayanagaram about petrol and diesel prices
ఆర్టీసీ కాంప్లెక్స్​ వద్ద ఏఐటీయూసీ ధర్నా

ప్రపంచ దేశాల్లో చమురు ధర తగ్గుతుంటే, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అంతకంతకు పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచేస్తుందంటూ విజయనగరంలో ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. డీజిల్ ధరల పెంపుని నిరసిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్​ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్​, డీజిల్​ రేట్లు అమాంతంగా పెరిగాయని ఏఐటీయూసీ నాయకులు బుగత అశోక్​ అన్నారు. కరోనా వైరస్​ వంటి కష్టకాలంలో కూడా చమురు ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని వాపోయారు. తక్షణమే కేంద్రం చమురు ధరలు తగ్గించాలని డిమాండ్​ చేశారు.

ప్రపంచ దేశాల్లో చమురు ధర తగ్గుతుంటే, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అంతకంతకు పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచేస్తుందంటూ విజయనగరంలో ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. డీజిల్ ధరల పెంపుని నిరసిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్​ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్​, డీజిల్​ రేట్లు అమాంతంగా పెరిగాయని ఏఐటీయూసీ నాయకులు బుగత అశోక్​ అన్నారు. కరోనా వైరస్​ వంటి కష్టకాలంలో కూడా చమురు ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని వాపోయారు. తక్షణమే కేంద్రం చమురు ధరలు తగ్గించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.