ETV Bharat / state

'కేంద్రంపై.. ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి'

author img

By

Published : Feb 20, 2021, 11:28 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా... విజయనగరంలో ఆందోళన చేశారు. ఐక్య వేదిక సంఘం ఆధ్వర్యంలో పలువురు నేతలు.. ఈ నిరసనలో పాల్గొన్నారు.

agitation
విజయనగరంలో విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ఆందోళన

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాలు నిరసన చేపట్టాయి. ఆందోళనలో భాగంగా విజయనగరం కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, బాలాజీ కూడలి, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే.. కేంద్రం నిర్ణయాన్ని ఖండించారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం మార్చుకోవాలని... కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాలు నిరసన చేపట్టాయి. ఆందోళనలో భాగంగా విజయనగరం కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, బాలాజీ కూడలి, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే.. కేంద్రం నిర్ణయాన్ని ఖండించారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం మార్చుకోవాలని... కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఇదీ చదవండి:

'నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించేలా చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.