ETV Bharat / state

అత్తారింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

author img

By

Published : Oct 4, 2020, 10:35 PM IST

చిన్న వయసులోనే ఆ బాలిక మెడలో తాళి పడింది. అత్తగారింట్లో అడుగు పెట్టగానే వేధింపులు ఎదురయ్యాయి. తన బాధను భర్తకు చెబితే.. పట్టింపులేని తనమే సమాధానమైంది. ఈ పరిస్థితుల్లో మనస్థాపానికి గురైన బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది.

a married woman committed suicide
a married woman committed suicide

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విషాదకర ఘటన జరిగింది. మెట్టినింట్లో వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సాలూరులో 16 ఏళ్ల బాలికను అదే పట్టణంలోని కొంకివీధికి చెందిన ఆమె మేనమామ హరిపాపారావుతో ఈ ఏడాది జనవరి నెలలో వివాహం జరిపించారు.

ఆమె భర్త వ్యవసాయం, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అత్తగారింట్లో ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. అత్త తనను వేధిస్తోందని బాలిక తన భర్తకు చెప్పినా పట్టించుకోలేదు. మనస్థాపానికి గురైన బాధితురాలు... ఆదివారం తన బెడ్​రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సాలూరు పట్టణ ఎస్సై సింహాద్రి నాయుడు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విషాదకర ఘటన జరిగింది. మెట్టినింట్లో వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సాలూరులో 16 ఏళ్ల బాలికను అదే పట్టణంలోని కొంకివీధికి చెందిన ఆమె మేనమామ హరిపాపారావుతో ఈ ఏడాది జనవరి నెలలో వివాహం జరిపించారు.

ఆమె భర్త వ్యవసాయం, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అత్తగారింట్లో ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. అత్త తనను వేధిస్తోందని బాలిక తన భర్తకు చెప్పినా పట్టించుకోలేదు. మనస్థాపానికి గురైన బాధితురాలు... ఆదివారం తన బెడ్​రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సాలూరు పట్టణ ఎస్సై సింహాద్రి నాయుడు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

అక్క కుమారుడిని కిరాతకంగా హత్య చేసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.