రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకం వ్యవసాయ బోరు రిగ్గింగ్ వాహనం విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గానికి కేటాయించారు. మాడుగుల, చీడికాడ మండలాల్లోని గ్రామాల్లో ప్రసార పర్యటన నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో వైకాపా శ్రేణులు, అధికారులు వైఎస్సార్ జలకళ వాహనానికి స్వాగతం పలికి, జెండా ఊపి ప్రారంభించారు. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా వ్యవసాయ బోరు తీయడానికి ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాలో మాడుగుల, చోడవరం, భీమిలి నియోజకవర్గాలకు బోర్లు తీయడానికి రిగ్గింగ్ వాహనాలు కేటాయించారు.
ఇవీ చదవండి: