ETV Bharat / state

వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకురాని బంధువులు.. మానవత్వం చాటిన వాలంటీర్లు

author img

By

Published : May 19, 2021, 9:59 AM IST

విశాఖ జిల్లా భూపాలపట్నంలో వృద్ధురాలు మరణించింది. కరోనా భయంతో.. ఆమె అంత్యక్రియలకు కుటుంబీకులు సైతం ముందుకు రాలేదు. చివరికి.. వాలంటీర్లు మానవత్వం చాటి.. ఆమెకు అంతిమ సంస్కారాలు పూర్తి చేయించారు.

Volunteers conducted the funeral for the old woman
వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న వాలంటీర్లు

విశాఖ జిల్లా నాతవరం మండలం భూపాలపట్నానికి చెందిన రాజులమ్మ అనే వృద్ధురాలు సహజ మరణం పొందింది. అయినప్పటికీ.. కుటుంబ సభ్యులు మృతురాలి అంత్యక్రియలకు ముందుకు రాలేదు. కరోనా భయంతో.. ఆమె మృతదేహాన్ని అలాగే వదిలేశారు.

చివరికి.. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు నేతృత్వంలో వాలంటీర్లు చొరవ తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు జగదీష్, ఈశ్వరరావు, రాజు, రమేష్ తదితర పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది.. వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.

విశాఖ జిల్లా నాతవరం మండలం భూపాలపట్నానికి చెందిన రాజులమ్మ అనే వృద్ధురాలు సహజ మరణం పొందింది. అయినప్పటికీ.. కుటుంబ సభ్యులు మృతురాలి అంత్యక్రియలకు ముందుకు రాలేదు. కరోనా భయంతో.. ఆమె మృతదేహాన్ని అలాగే వదిలేశారు.

చివరికి.. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు నేతృత్వంలో వాలంటీర్లు చొరవ తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు జగదీష్, ఈశ్వరరావు, రాజు, రమేష్ తదితర పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది.. వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇవీ చూడండి:

ఎన్టీఆర్ ఆసుపత్రికి వ్యాపారుల విరాళాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.