కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖలో డీఆర్ఎం కార్యాలయం సిబ్బంది భద్రత, శుభ్రత కోసం రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ నుంచి డీఆర్ఎం కార్యాలయానికి వచ్చే వారంతా శానిటేషన్ ప్రక్రియను ముగించుకొని రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కనీసం పది సెకన్ల పాటు ఇందులో నుంచి నడిస్తే సూక్ష్మజీవులు పూర్తిగా తొలగిపోతాయన్నారు. కరోనా వ్యాప్తి నివారణ, సిబ్బంది భద్రతా ప్రధాన ధ్యేయంగా ఈ టన్నెల్ ఉపకరిస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: