ETV Bharat / state

రహదారి నిర్మాణం కోసం.. గ్రామస్థుల ధర్నా

రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే.పీ. అగ్రహారం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అధ్వాన్నంగా తయారైన రోడ్డుపై నడవడం సాధ్యం కావడం లేదని వాపోతున్నారు.

author img

By

Published : Jun 1, 2019, 2:14 PM IST

రహదారి నిర్మాణం చేపట్టండి.. రోడ్డుపై గ్రామస్థుల ధర్నా
రహదారి నిర్మాణం చేపట్టండి.. రోడ్డుపై గ్రామస్థుల ధర్నా

రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే.పీ. అగ్రహారం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నర్సీపట్నం మండలం సుబ్బారాయుడుపాలెం నుంచి రోలుగుంట మండలం కొమరవోలు మీదుగా జే.పీ. అగ్రహారం వరకు ఉన్న 13 కిలోమీటర్ల రహదారి అధ్వాన్నంగా తయారైంది. దీని మరమ్మతుల కోసం 3 నెలల క్రితం సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ నగరానికి చెందిన గుత్తేదారు టెండర్ పొందాడు. అయితే అతను తారురోడ్డును పెకిలించి అలా వదిలేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలినడక సాధ్యపడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

రహదారి నిర్మాణం చేపట్టండి.. రోడ్డుపై గ్రామస్థుల ధర్నా

రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే.పీ. అగ్రహారం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నర్సీపట్నం మండలం సుబ్బారాయుడుపాలెం నుంచి రోలుగుంట మండలం కొమరవోలు మీదుగా జే.పీ. అగ్రహారం వరకు ఉన్న 13 కిలోమీటర్ల రహదారి అధ్వాన్నంగా తయారైంది. దీని మరమ్మతుల కోసం 3 నెలల క్రితం సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ నగరానికి చెందిన గుత్తేదారు టెండర్ పొందాడు. అయితే అతను తారురోడ్డును పెకిలించి అలా వదిలేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలినడక సాధ్యపడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి..

కాటన్ బ్యారేజ్ నుంచి డెల్టా కాల్వలకు నీటి విడుదల

Intro:Ap_vja_17_01_ex_mla_jelelKahan_pc_AV_C10
Sai babu_ Vijayawada : 9849803586
యాంకర్ : వర్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు జలీల్ఖాన్ ప్రయత్నించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో వైకాపాకు పోటీగా ఎన్నికల్లో పోరాటం చేశామని, నువ్వా నేనా అనే విధంగా ఎన్నికలు సాగాయని కానీ చివరకు ప్రజలు వైకాపా అభ్యర్థికి తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు. అయినప్పటికీ నియోజకవర్గంలోని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తానని రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రజల్లో చైతన్యం అని తెలిపారు వర్క్ బోర్డు ఒక పాముల పుట్ట అని ఆ రోజు తనకి చైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు తెలిపిన పడే కష్టం కాదని స్వీకరించాలని ప్రతి ఒక్క విషయం బోర్డులో రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు తను సంతోషంగా నీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు..
బైట్ : జలీల్ ఖాన్.. మాజీ సభ్యులు..


Body:Ap_vja_17_01_ex_mla_jelelKahan_pc_AV_C10


Conclusion:Ap_vja_17_01_ex_mla_jelelKahan_pc_AV_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.