చోడవరంలో కూరగాయల వ్యాపారులు ఎమ్మెల్యే ధర్మశ్రీని కలిశారు. తొలుత రైతు బజార్ స్థలం నుంచి కళాశాల మైదానంలోకి పోలీసులు మార్పించారు. తాజాగా కళాశాల మైదానం నుంచి రెండు కి.మీ. దూరంలో ఉన్న అన్నవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించాలని... అధికారుల చెబుతున్నారని కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే ధర్మశ్రీ స్పందించి... యధావిధిగా రైతు బజార్ స్థలంలోనే కూరగాయలు అమ్ముకోవచ్చని చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే ధర్మశ్రీని కలిసిన చిరువ్యాపారులు
విశాఖ జిల్లా చోడవరంలోని రైతుబజారులో అధికారులు చేస్తున్న మార్పులను కూరగాయల వ్యాపారులు ఎమ్మెల్యే ధర్మశీ దృష్టికి తీసుకెళ్లారు. తమ ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వ్యాపారుల సమస్యను పరిష్కరించారు.
చోడవరంలో కూరగాయల వ్యాపారులు ఎమ్మెల్యే ధర్మశ్రీని కలిశారు. తొలుత రైతు బజార్ స్థలం నుంచి కళాశాల మైదానంలోకి పోలీసులు మార్పించారు. తాజాగా కళాశాల మైదానం నుంచి రెండు కి.మీ. దూరంలో ఉన్న అన్నవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించాలని... అధికారుల చెబుతున్నారని కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే ధర్మశ్రీ స్పందించి... యధావిధిగా రైతు బజార్ స్థలంలోనే కూరగాయలు అమ్ముకోవచ్చని చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చారు.