ETV Bharat / state

గాజువాక వాసి మల్లికార్జునరావుకు తెలంగాణ పోలీసుల​ నోటీసులు.. ఎందుకంటే..!

author img

By

Published : Jul 3, 2021, 2:03 PM IST

Updated : Jul 3, 2021, 4:32 PM IST

విశాఖ జిల్లా గాజువాక వాసి పరుచూరి మల్లికార్జునరావుకు తెలంగాణ పోలీసులు నోటిసు​లు జారీ చేశారు. ఒక టీవీ షోలో కరోనా వ్యాప్తి, ప్రభావంపై మాట్లాడుతూ.. జనాన్ని భయపెట్టేలా వ్యాఖ్యలు చేశారని.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు అందించారు. మంచి చేస్తున్న తనను ఇబ్బంది పెడుతున్నారని మల్లికార్జునరావు నిరసన తెలిపారు. నిరాహార దీక్షకు దిగారు.

TS government notice
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ నోటిసులు

విశాఖ జిల్లా గాజువాక వాసి పరుచూరి మల్లికార్జునరావుకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక టీవీ షోలో.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. కరోనా వైరస్ వలన ప్రతి ఇంట్లో ఒక మనిషి చనిపోతారంటూ మల్లికార్జునరావు చేసిన వాఖ్యలపై మండిపడ్డారు. వివరణ కోరినప్పటికీ మల్లికార్జునరావు స్పందించని కారణంగా.. హైదరాబాద్ సూల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్​లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు గాజువాక పోలీసులను సంప్రదించారు. గాజువాకలోని అల్లూరి టవర్స్​లో ఉన్న మల్లికార్జునరావుకు నోటీసులు అందజేశారు.

కరోనా మహమ్మారి నుంచి బాధితులను కాపాడుతున్నందుకు... కొంతమంది తనపై కక్షసాధిస్తున్నారని మల్లికార్జునరావు ఆరోపించారు. తను నివాసం ఉంటున్న ఇంటివద్దే నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా బాధితులకు సేవ చేస్తున్నందుకు తనను, తన వాలంటీర్లను ఫోన్ల ద్వారా భయపెడుతున్నారని ఆవేదన చెందారు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే వాట్సాప్.. టెలిగ్రామ్ బ్లాక్​ చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖ జిల్లా గాజువాక వాసి పరుచూరి మల్లికార్జునరావుకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక టీవీ షోలో.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. కరోనా వైరస్ వలన ప్రతి ఇంట్లో ఒక మనిషి చనిపోతారంటూ మల్లికార్జునరావు చేసిన వాఖ్యలపై మండిపడ్డారు. వివరణ కోరినప్పటికీ మల్లికార్జునరావు స్పందించని కారణంగా.. హైదరాబాద్ సూల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్​లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు గాజువాక పోలీసులను సంప్రదించారు. గాజువాకలోని అల్లూరి టవర్స్​లో ఉన్న మల్లికార్జునరావుకు నోటీసులు అందజేశారు.

కరోనా మహమ్మారి నుంచి బాధితులను కాపాడుతున్నందుకు... కొంతమంది తనపై కక్షసాధిస్తున్నారని మల్లికార్జునరావు ఆరోపించారు. తను నివాసం ఉంటున్న ఇంటివద్దే నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా బాధితులకు సేవ చేస్తున్నందుకు తనను, తన వాలంటీర్లను ఫోన్ల ద్వారా భయపెడుతున్నారని ఆవేదన చెందారు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే వాట్సాప్.. టెలిగ్రామ్ బ్లాక్​ చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

Viral video: బాటిల్​తో పాలు తాగిన ఏనుగు

Last Updated : Jul 3, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.