ETV Bharat / state

గోపాలపట్నంలో ఓ ఇంట్లో చోరీ.. నగదు, బంగారం ఆపహరణ

విశాఖ జిల్లా గోపాలపట్నం శివారు ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఇంటి యజమాని ఇంటికి తాళం వేసి బయట పడుకున్నప్పుడు దొంగలు తమ చేతివాటం చూపించారు. సుమారు లక్షన్నర నగదు, రెండున్నర తులాలు బంగారం అపహరణ జరిగిందని యజమాని తెలిపారు.

author img

By

Published : Jul 20, 2020, 8:59 PM IST

vishaka district
గోపాలపట్నం నగర శివారులో దొంగతనం

విశాఖ జిల్లా గోపాలపట్నం కొత్తపాలెం శివారు ప్రాంతమైన భగత్ సింగ్ నగర్​లో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దొంగతనం జరిగిందని ఇంటి యజమాని గుర్తించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉందని ఇంటికి తాళం వేసి బయట పడుకోవటంతో దొంగలు పసిగట్టి దొంగతనానికి పాల్పడ్డారు.

సుమారు లక్షన్నర నగదు, రెండున్నర తులాలు బంగారం అపహరణ జరిగిందని పోలీసులు తెలిపారు. కాకినాడ రిజిస్ట్రేషన్ చెందిన ఒక ద్విచక్రవాహనములో వచ్చి చోరీకి పాల్పడి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇంటి నుంచి అర కిలోమీటర్ల దూరంలో తుప్పల్లో దొంగలు పడేసిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విశాఖ జిల్లా గోపాలపట్నం కొత్తపాలెం శివారు ప్రాంతమైన భగత్ సింగ్ నగర్​లో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దొంగతనం జరిగిందని ఇంటి యజమాని గుర్తించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉందని ఇంటికి తాళం వేసి బయట పడుకోవటంతో దొంగలు పసిగట్టి దొంగతనానికి పాల్పడ్డారు.

సుమారు లక్షన్నర నగదు, రెండున్నర తులాలు బంగారం అపహరణ జరిగిందని పోలీసులు తెలిపారు. కాకినాడ రిజిస్ట్రేషన్ చెందిన ఒక ద్విచక్రవాహనములో వచ్చి చోరీకి పాల్పడి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇంటి నుంచి అర కిలోమీటర్ల దూరంలో తుప్పల్లో దొంగలు పడేసిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇదీ చదవండి నాటుసారా అమ్ముతున్న వారిని పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.