ETV Bharat / state

వివాదాస్పదంగా ఏయూ వీసీ తీరు.. చర్యలకు ప్రజాసంఘాల డిమాండ్

author img

By

Published : Feb 19, 2023, 8:11 PM IST

Updated : Feb 19, 2023, 10:11 PM IST

Au vc attend YSRCP party meeting : ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉపకులపతి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలోని ఒక హోటల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్లు, అధ్యాపకుల సమావేశంలో ఉపకులపతి నేరుగా వేదిక మీద కూర్చోవడం వివాదాస్పదమైంది. వీసీపై చర్యలు తీసుకోవాలని, వైఎస్సార్సీపీ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం.. ఆ విషయం తన దృష్టికి రాలేదని చెప్తూనే,.. జరిగి ఉంటే ఎన్నికల సంఘమే చూసుకుంటుందని చెప్పడం కొసమెరుపు.

ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉపకులపతి
ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉపకులపతి
వీసీపై చర్యలకు ప్రజాసంఘాల డిమాండ్

AU VC attend YSRCP party meeting : విశాఖలోని ఓ హోటల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ప్రైవేట్ కాలేజీల కరస్పాండెంట్స్, అధ్యాపకులతో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ, మూడు జిల్లాల సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. వారి పక్కనే ఆంధ్ర విశ్వ విద్యాలయం మాజీ రిజిస్ట్రార్​ కృష్ణ మోహన్, ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి ఉండగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఉపకులపతి పార్టీ సమావేశంలో పాల్గొనడమే గాకుండా ఒక అభ్యర్థి వైపు ప్రచారం చేయడం ముమ్మాటికీ దారుణమని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాందోళన పసిగట్టిన సమావేశం నిర్వాహకులు.. ఉపకులపతి ప్రసాద్ రెడ్డిని వేరొక మార్గం ద్వారా హోటల్ నుంచి బయటకు పంపించారు. సమావేశం జరుగుతున్న హాల్ వద్దకు మీడియా ప్రతినిధులు రాకుండా తలుపులు వేసి వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర నాయకులను వేరే మార్గంలో పంపించి వేశారు.

నిలదీసిన ప్రజాసంఘాలు... ప్రజాసంఘాల ప్రతినిధులు నేరుగా సమావేశం జరుగుతున్న హోటల్ వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ పెద్దలను నిలదీశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితై విద్యావంతులైన పట్టభద్రులు చూస్తూ ఊరుకోరని.. తగిన బుద్ది చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులను కోరారు. కాగా, నిరసన తెలిపిన ప్రజాసంఘాల నాయకులను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ కాలేజ్ నిర్వాహకులు, అధ్యాపకులను ఓట్ల కోసం పార్టీ నేతలు, ఏయూ వీసీ మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

అధికార దుర్వినియోగం... అధికార పార్టీ పూర్తిగా కోడ్ ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పారు. ఏయూ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపకులపతిగా ఉంటూ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడం దారుణమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు వాలంటీర్ వ్యవస్థ ను అడ్డుపెట్టుకొని ఎన్నికలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నిస్పాక్షికపతంగా ఎన్నికలు జరగాలని కోరారు.

ఈ ఘటన జరుగుతున్న సమయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోనే ఉన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ప్రచారంలో పాల్గొనడం తనదృష్టికీ రాలేదని అన్నారు. వెనువెంటనే... అసలు అది పార్టీ సమావేశం కాదని బుకాయించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మీద ప్రతిపక్షాలు ఏదో ఒక ఆరోపణ చేయడం పరిపాటే అని కొట్టిపారేశారు. ఇంకాస్త ముందడుగు వేసి మీడియా ప్రతినిధులను... వీసీ ప్రసాద్ రెడ్డిని మీరు చూశారా అని ప్రశ్నించారు. వాస్తవంగా వీసీ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే, ఆ విషయం ఎన్నికల సంఘం చూసుకుంటుదని మంత్రి బొత్స తనదైన తీరులో సమాధానం చెప్పారు.

అక్కడేం జరిగిందో.. మీరేం చూశారో.. ఆరోపణలు ఎంతో మంది చేస్తుంటారు. చేసిన ఆరోపణలకల్లా మేం సమాధానం చెప్పుకుంటామా..? ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. - బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి

పలువురి అరెస్టు.. వైఎస్సార్సీపీ అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడాలని చూస్తే విద్యావంతులైన పట్టభద్రులు తగిన బుద్ది చెబుతారని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులకు విజ్ఙప్తి చేశాయి. ఈ విషయమై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ప్రజాసంఘాలు రంగం సిద్ధం చేశాయి. సమావేశం నిర్వహించిన వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్​పై కేసులు నమోదు చేయాలని, ఎన్నికల నియమావళిని ధిక్కరించిన సుధాకర్‌కు పోటీచేసే అర్హత లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు నిరసనలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, ఎం.సుబ్బారావు, చంద్రశేఖర్‌, బి.గౌతమ్‌, ఎల్‌.జె.నాయుడు, జి.అప్పలరాజును విశాఖ రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టడం దారుణం. ప్రైవేట్ కాలేజ్ నిర్వాహకులు, అధ్యాపకులను ఓట్లు కోసం అధికార వైఎస్సార్సీపీ, ఏయూ వీసీ మభ్యపెడుతున్నారు. అధికార పార్టీ పూర్తిగా కోడ్ ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నికల సంఘం ఏయూ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపకులపతి గా ఉంటూ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడం దారుణం. - అజా శర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధానకార్యదర్శి

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన సమావేశానికి.. ఏయూ వీసీ ప్రసాద్‌ రెడ్డి హాజరుకావడంపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైకాపా కార్యాలయంలా వీసీ మార్చారని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీసీని వెంటనే పదవి నుంచి తొలగించాలని.. ఈ మేరకు గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

వీసీపై చర్యలకు ప్రజాసంఘాల డిమాండ్

AU VC attend YSRCP party meeting : విశాఖలోని ఓ హోటల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ప్రైవేట్ కాలేజీల కరస్పాండెంట్స్, అధ్యాపకులతో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ, మూడు జిల్లాల సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. వారి పక్కనే ఆంధ్ర విశ్వ విద్యాలయం మాజీ రిజిస్ట్రార్​ కృష్ణ మోహన్, ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి ఉండగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఉపకులపతి పార్టీ సమావేశంలో పాల్గొనడమే గాకుండా ఒక అభ్యర్థి వైపు ప్రచారం చేయడం ముమ్మాటికీ దారుణమని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాందోళన పసిగట్టిన సమావేశం నిర్వాహకులు.. ఉపకులపతి ప్రసాద్ రెడ్డిని వేరొక మార్గం ద్వారా హోటల్ నుంచి బయటకు పంపించారు. సమావేశం జరుగుతున్న హాల్ వద్దకు మీడియా ప్రతినిధులు రాకుండా తలుపులు వేసి వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర నాయకులను వేరే మార్గంలో పంపించి వేశారు.

నిలదీసిన ప్రజాసంఘాలు... ప్రజాసంఘాల ప్రతినిధులు నేరుగా సమావేశం జరుగుతున్న హోటల్ వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ పెద్దలను నిలదీశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితై విద్యావంతులైన పట్టభద్రులు చూస్తూ ఊరుకోరని.. తగిన బుద్ది చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులను కోరారు. కాగా, నిరసన తెలిపిన ప్రజాసంఘాల నాయకులను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ కాలేజ్ నిర్వాహకులు, అధ్యాపకులను ఓట్ల కోసం పార్టీ నేతలు, ఏయూ వీసీ మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

అధికార దుర్వినియోగం... అధికార పార్టీ పూర్తిగా కోడ్ ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పారు. ఏయూ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపకులపతిగా ఉంటూ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడం దారుణమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు వాలంటీర్ వ్యవస్థ ను అడ్డుపెట్టుకొని ఎన్నికలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నిస్పాక్షికపతంగా ఎన్నికలు జరగాలని కోరారు.

ఈ ఘటన జరుగుతున్న సమయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోనే ఉన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ప్రచారంలో పాల్గొనడం తనదృష్టికీ రాలేదని అన్నారు. వెనువెంటనే... అసలు అది పార్టీ సమావేశం కాదని బుకాయించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మీద ప్రతిపక్షాలు ఏదో ఒక ఆరోపణ చేయడం పరిపాటే అని కొట్టిపారేశారు. ఇంకాస్త ముందడుగు వేసి మీడియా ప్రతినిధులను... వీసీ ప్రసాద్ రెడ్డిని మీరు చూశారా అని ప్రశ్నించారు. వాస్తవంగా వీసీ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే, ఆ విషయం ఎన్నికల సంఘం చూసుకుంటుదని మంత్రి బొత్స తనదైన తీరులో సమాధానం చెప్పారు.

అక్కడేం జరిగిందో.. మీరేం చూశారో.. ఆరోపణలు ఎంతో మంది చేస్తుంటారు. చేసిన ఆరోపణలకల్లా మేం సమాధానం చెప్పుకుంటామా..? ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. - బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి

పలువురి అరెస్టు.. వైఎస్సార్సీపీ అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడాలని చూస్తే విద్యావంతులైన పట్టభద్రులు తగిన బుద్ది చెబుతారని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులకు విజ్ఙప్తి చేశాయి. ఈ విషయమై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ప్రజాసంఘాలు రంగం సిద్ధం చేశాయి. సమావేశం నిర్వహించిన వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్​పై కేసులు నమోదు చేయాలని, ఎన్నికల నియమావళిని ధిక్కరించిన సుధాకర్‌కు పోటీచేసే అర్హత లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు నిరసనలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, ఎం.సుబ్బారావు, చంద్రశేఖర్‌, బి.గౌతమ్‌, ఎల్‌.జె.నాయుడు, జి.అప్పలరాజును విశాఖ రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టడం దారుణం. ప్రైవేట్ కాలేజ్ నిర్వాహకులు, అధ్యాపకులను ఓట్లు కోసం అధికార వైఎస్సార్సీపీ, ఏయూ వీసీ మభ్యపెడుతున్నారు. అధికార పార్టీ పూర్తిగా కోడ్ ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నికల సంఘం ఏయూ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపకులపతి గా ఉంటూ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడం దారుణం. - అజా శర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధానకార్యదర్శి

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన సమావేశానికి.. ఏయూ వీసీ ప్రసాద్‌ రెడ్డి హాజరుకావడంపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైకాపా కార్యాలయంలా వీసీ మార్చారని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీసీని వెంటనే పదవి నుంచి తొలగించాలని.. ఈ మేరకు గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 19, 2023, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.