ETV Bharat / state

'వేతనాలే అడిగారు.. ప్రభుత్వ పెద్దలు దోచుకున్న సొమ్ము అడగలేదు' - అవంతి శ్రీనివాస్ పై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తాజా వ్యాఖ్యలు

వేతనాలు అడిగిన నర్సులపై మంత్రి.. పోలీసులతో దౌర్జన్యం చేయించిన తీరును తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు.

Telugu woman state president Vangalapudi Anita
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
author img

By

Published : Jan 7, 2021, 4:34 PM IST

విశాఖ జిల్లా పాడేరులో మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్న నర్సుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. వేతనాలు అడిగిన నర్సులపై మంత్రి పోలీసులతో దౌర్జన్యం చేయించిన తీరును ఆమె ఖండించారు. కారు దిగి ఆందోళన ఎందుకో అడిగే తీరిక కూడా మంత్రికి లేదా అని నిలదీశారు. చేసిన కష్టానికి నర్సులు వేతనాలు అడిగారే తప్ప.. ప్రభుత్వ పెద్దలు దోచుకున్న సొమ్ము అడగలేదన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన నర్సులకు నాలుగు నెలలుగా జీతాలివ్వకపోడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవటం దుర్మార్గమని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి...

విశాఖ జిల్లా పాడేరులో మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్న నర్సుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. వేతనాలు అడిగిన నర్సులపై మంత్రి పోలీసులతో దౌర్జన్యం చేయించిన తీరును ఆమె ఖండించారు. కారు దిగి ఆందోళన ఎందుకో అడిగే తీరిక కూడా మంత్రికి లేదా అని నిలదీశారు. చేసిన కష్టానికి నర్సులు వేతనాలు అడిగారే తప్ప.. ప్రభుత్వ పెద్దలు దోచుకున్న సొమ్ము అడగలేదన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన నర్సులకు నాలుగు నెలలుగా జీతాలివ్వకపోడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవటం దుర్మార్గమని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి...

సడన్ బ్రేక్​తో.. ఇనుప ఊచలు గుచ్చుకుని లారీ డ్రైవర్ మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.