ETV Bharat / state

కేసుల మాఫీ కోసం ఉక్కు కర్మాగారాన్ని త్యాగం చేస్తున్నారు: అచ్చెన్న

author img

By

Published : Mar 4, 2021, 7:17 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అయిదు కోట్ల ఆంధ్రులను సమీకరిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాలు అయిదో తేదీన తలపెట్టిన బంద్​కు తెదేపా తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయడం అనే నిర్ణయం బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

tdp leader acchennaidu fire on ycp government about vizag steel plant privatization
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అయిదు కోట్ల ఆంధ్రులను సమీకరిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్లాంటును కాపాడుకునేందుకు కలిసి పోరాడదామంటే అధికార పార్టీ నుంచి కనీస స్పందన కరవైందని దుయ్యబట్టారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు కోసం సమైక్యంగా పోరాడేందుకు సిద్ధమని అచ్చెన్న ప్రకటించారు.

సంపూర్ణ మద్దతు...

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాలు అయిదో తేదీన తలపెట్టిన బంద్​కు తెదేపా తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. స్టీల్ ప్లాంట్ లేకుంటే విశాఖ ఉనికికే ప్రమాదమని పేర్కొన్నారు. 40 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా పరిశ్రమ వల్ల ఉపాధి లభిస్తోందన్న అచ్చెన్న.. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వానికి రూ.33 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8వేల కోట్లు పరిశ్రమ నుంచి పన్నుల రూపంలో వచ్చాయని తెలిపారు. ఇవేమీ పట్టనట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేసుల మాఫీ కోసం 32 మంది ప్రాణ త్యాగాలను వాడుకుంటున్నారని ఆక్షేపించారు.

'బంద్​కు సహకరించాలి'...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మార్చి అయిదో తేదీన తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్​కు విద్యా సంస్థలు, దుకాణ యజమానులు సహకరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయడం అనే నిర్ణయం బాధాకరమని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు.

ఇదీచదవండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అయిదు కోట్ల ఆంధ్రులను సమీకరిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్లాంటును కాపాడుకునేందుకు కలిసి పోరాడదామంటే అధికార పార్టీ నుంచి కనీస స్పందన కరవైందని దుయ్యబట్టారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు కోసం సమైక్యంగా పోరాడేందుకు సిద్ధమని అచ్చెన్న ప్రకటించారు.

సంపూర్ణ మద్దతు...

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాలు అయిదో తేదీన తలపెట్టిన బంద్​కు తెదేపా తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. స్టీల్ ప్లాంట్ లేకుంటే విశాఖ ఉనికికే ప్రమాదమని పేర్కొన్నారు. 40 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా పరిశ్రమ వల్ల ఉపాధి లభిస్తోందన్న అచ్చెన్న.. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వానికి రూ.33 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8వేల కోట్లు పరిశ్రమ నుంచి పన్నుల రూపంలో వచ్చాయని తెలిపారు. ఇవేమీ పట్టనట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేసుల మాఫీ కోసం 32 మంది ప్రాణ త్యాగాలను వాడుకుంటున్నారని ఆక్షేపించారు.

'బంద్​కు సహకరించాలి'...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మార్చి అయిదో తేదీన తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్​కు విద్యా సంస్థలు, దుకాణ యజమానులు సహకరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయడం అనే నిర్ణయం బాధాకరమని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు.

ఇదీచదవండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.