ETV Bharat / state

స్వల్పంగా పెరిగిన తాండవ జలాశయం నీటిమట్టం

author img

By

Published : Jul 21, 2020, 8:27 PM IST

విశాఖ తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు తాండవ జలాశయం నీరు అందిస్తోంది. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ జలాశయంలో మూడు అడుగుల నీటిమట్టం పెరిగింది. దీంతో రైతులకు సకాలంలో నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

tandavar reservoir water level increases in visakha district
తాండవ నదిలో పెరిగిన నీటిమట్టం

ఇటీవల విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నాతవరం మండలం తాండవ జలాశయం నీటిమట్టం మూడు అడుగుల మేర పెరిగింది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం 374 అడుగులకు చేరింది. నీటిమట్టం ఆశాజనకంగా ఉండటం వల్ల ఖరీఫ్ కాలానికి సంబంధించి నీటిని విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూలై నెలలో ఎండలు ముదిరితే... ఆగస్టు 5 లేదా 10 తారీఖుల్లో నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇటీవల విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నాతవరం మండలం తాండవ జలాశయం నీటిమట్టం మూడు అడుగుల మేర పెరిగింది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం 374 అడుగులకు చేరింది. నీటిమట్టం ఆశాజనకంగా ఉండటం వల్ల ఖరీఫ్ కాలానికి సంబంధించి నీటిని విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూలై నెలలో ఎండలు ముదిరితే... ఆగస్టు 5 లేదా 10 తారీఖుల్లో నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి :

కోనాంలో సమృద్ధిగా నీరు.. ఖరీఫ్ సాగుకు లేదిక బెంగ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.