ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 400మందికి పైగా క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. ఈ పోటీలు రోటరీ క్లబ్, విశాఖ వ్యాలీ, ఎల్ఏంజిల్స్ ఇంటర్నేషనల్ వాలంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ రోటరీ క్లబ్ డైరక్టర్ జానకి రామయ్య మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను 10 రోజులపాటు జపాన్ పంపించి.. ఆ దేశ ఒలంపియన్స్తో ఆడే అవకాశం కల్పించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి : తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం!