విశాఖపట్నం అనకాపల్లిలోని దాడి వీరు నాయుడు డిగ్రీ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో... ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జోనల్ కమిషనర్ పి. శ్రీరామమూర్తి.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడంపై ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్తోకలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చూడండి: