గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం విశాఖ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. మరో వైపు త్వరలో నగరంలో సిటీ బస్సులను తిప్పడానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే వైద్య శాఖకు లేఖ రాసినట్లు చెప్తున్న విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎంవై దానంతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి..
ప్రశ్న: గ్రామ ,వార్డు సచివాలయ పరీక్షల అభ్యర్థులకు విశాఖ ఆర్టీసీ ఎలాంటి సేవలు అందిస్తోంది?
జవాబు: కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలతో ఈసారి వార్డు, గ్రామ సచివాలయ పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడపుతాము. రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ నుంచి పరీక్ష కేంద్రాలకు ఈ సర్వీసులు నడుస్తాయి. పరీక్ష జరుగుతున్నంత సేపు అక్కడే ఉండి తిరిగి పరిక్ష ముగిసిన తరువాత అభ్యర్థులను వారి గమ్య స్థానాలకు చేర్చుతాం. ఇప్పటికే ఇందుకు అవసరమైన బస్సులను సిద్ధం చేశాం.
ప్రశ్న : ఆన్ లాక్ ప్రక్రియ మొదలైంది. నగరంలో సిటీ బస్లు ఎప్పటి నుంచి తిరుగుతాయి?
జవాబు: ఈ విషయమై వైద్యశాఖకు లేఖ రాశాం. వారి నుంచి అనుమతులు వచ్చాక నగర పరిధిలో బస్సులను తిప్పే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తాం. కొవిడ్ నియమాలకు అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి.
ఇవీ చదవండి...