ETV Bharat / state

చోడవరంలో దారుణం.. హక్కుల నేత హత్య - vizag

సమాచార హక్కు చట్టం కార్యకర్త దారుణ హత్య... మన్యంలో కలకలం రేపింది. భార్య ఎదుటే హంతకులు శ్రీనును కిరాతంగా హతమార్చారు. అధికారుల అవినీతిపై 'సమాచార' అస్త్రాన్ని వదిలే శ్రీను హత్య... పలు సందేహాలను రేకెత్తిస్తోంది.

చోడవరంలో దారుణం.. హక్కుల నేత హత్య
author img

By

Published : Jun 5, 2019, 6:49 AM IST

విశాఖ జిల్లా చోడవరంలో రాత్రివేళ హక్కుల నేత హత్యకు గురయ్యాడు. భార్య కళ్లెదుటే ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే... చోడవరానికి చెందిన మండే శ్రీను(44) సమాచార హక్కు నేతగా అక్కడ అందరికీ సుపరిచితమే! అధికారుల తీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీంచటం శ్రీనుకు అలవాటు. ఏమైనా సందేహాలుంటే.. తక్షణమే సమాచార హక్కు అస్త్రాన్ని సంధించేవాడు. మంగళవారం రాత్రి ద్వారకా నగర్​లోని తన ఇంటినుంచి మరోచోటకు భార్యతో కలిసి బయలు దేరాడు శ్రీను. ఇంతలోనే కొందరు వాహనాన్ని అడ్డుకున్నారు. ఏం జరుగుతుందని ఆలోచించేలోపే... రాడ్డుతో బలంగా కొట్టారు. భయంతో భార్య పరుగులు తీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఇంటివైపు పరుగులు తీసింది. అందరూ వచ్చేలోపే శ్రీను విగతజీవిగా పడి ఉన్నాడు. నిందితులు శ్రీను ముఖాన్ని ఛిద్రం చేసేశారు. మృతుడు గతంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడిగా పనిచేశాడు. ఎన్నికలకంటే ముందు రాజీనామా చేని వైకాపా గూటికి చేరారు. అధికారుల తప్పుల్ని ప్రశ్నించే శ్రీను హత్యపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

విశాఖ జిల్లా చోడవరంలో రాత్రివేళ హక్కుల నేత హత్యకు గురయ్యాడు. భార్య కళ్లెదుటే ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే... చోడవరానికి చెందిన మండే శ్రీను(44) సమాచార హక్కు నేతగా అక్కడ అందరికీ సుపరిచితమే! అధికారుల తీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీంచటం శ్రీనుకు అలవాటు. ఏమైనా సందేహాలుంటే.. తక్షణమే సమాచార హక్కు అస్త్రాన్ని సంధించేవాడు. మంగళవారం రాత్రి ద్వారకా నగర్​లోని తన ఇంటినుంచి మరోచోటకు భార్యతో కలిసి బయలు దేరాడు శ్రీను. ఇంతలోనే కొందరు వాహనాన్ని అడ్డుకున్నారు. ఏం జరుగుతుందని ఆలోచించేలోపే... రాడ్డుతో బలంగా కొట్టారు. భయంతో భార్య పరుగులు తీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఇంటివైపు పరుగులు తీసింది. అందరూ వచ్చేలోపే శ్రీను విగతజీవిగా పడి ఉన్నాడు. నిందితులు శ్రీను ముఖాన్ని ఛిద్రం చేసేశారు. మృతుడు గతంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడిగా పనిచేశాడు. ఎన్నికలకంటే ముందు రాజీనామా చేని వైకాపా గూటికి చేరారు. అధికారుల తప్పుల్ని ప్రశ్నించే శ్రీను హత్యపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

ఇదీ చదవండీ: మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం

New Delhi, Jun 04 (ANI): Shiv Sena MP Arvind Sawant on Tuesday took charge of Minister of Heavy Industries and Public Enterprise. He was greeted by his staff members and other officials. After taking the charge, Sawant said that he wants to solve the problem of unemployment by reviving some industries.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.