విశాఖ జిల్లా హుకుంపేట మండలం గడికించుమండలో పొలంలో నిల్వ ఉంచిన వరి కుప్పలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు తమ పొలాల్లో పండిన పంటను 9 కుప్పలుగా ఒకే దగ్గర పోశారు. సాయంత్రం వేళ వరికుప్పలకు మంటలు అంటుకున్నాయి. రైతులు మంటలార్పేందుకు యత్నించారు. అదుపు కాకపోవటం వల్ల పాడేరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వాహనం పొలాల్లోకి వెళ్లే అవకాశం లేనందున బకెట్లతో నీళ్లు పట్టుకెళ్లి అగ్ని శిఖలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు ఆగలేదు. ధాన్యం పూర్తిగా దగ్ధమయ్యింది. దాంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: