ETV Bharat / state

విశాఖలో మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సదస్సు..

author img

By

Published : Jan 7, 2023, 10:04 PM IST

G 20 summit in Visakhapatnam: విశాఖలొ మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సదస్సు జరగనుందని, అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్​ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి అన్నారు. ఈ సదస్సుకు సుమారు 45 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని ఆమె తెలిపారు. వివిధ దేశాల నుంచి జీ -20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

G 20 summit
జీ -20 సదస్సు

G 20 summit in AP: విశాఖలో మార్చి 28, 29 తేదీల్లో జరగనున్న జీ -20 సదస్సుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్​ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి అన్నారు. వీఎమ్ఆర్డీఏ హాల్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్.జగన్​మోహన్​రెడ్డి ఆదేశాల మేరకు మార్చి నెల 28, 29 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు సంబంధించి, నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు సుమారు 45 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రం నుంచి సుమారు 50 మంది వరకు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు.

వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ టూరిస్ట్ ప్రదేశాలతో పాటుగా.. ప్రాచీన ప్రాచుర్యం కలిగిన ప్రదేశాలను విదేశీయులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విదేశీ ప్రతినిధులకు అర్థమయ్యే భాషలో తెలిపేందుకు ట్రాన్స్ లేటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్​ ఏ.మల్లికార్జున మాట్లాడుతూ జీ -20 సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 8 జిల్లా కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు స్టేట్ లెవెల్ కమిటీలతో అనుబంధంగా పని చేస్తాయన్నారు. జిల్లాలో ప్రముఖంగా 10 టూరిస్ట్ ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. పోర్టు, నేవీ అధికారుల సహకారంతో జీ -20 సదస్సు ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. పోలీస్ పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షంచడంతో పాటు రెండు రోజుల పాటు వారు పర్యటించే ప్రాంతాలలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన భద్రతను కల్పించనున్నట్లు పోలీస్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఇవీ చదవండి:

G 20 summit in AP: విశాఖలో మార్చి 28, 29 తేదీల్లో జరగనున్న జీ -20 సదస్సుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్​ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి అన్నారు. వీఎమ్ఆర్డీఏ హాల్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్.జగన్​మోహన్​రెడ్డి ఆదేశాల మేరకు మార్చి నెల 28, 29 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు సంబంధించి, నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు సుమారు 45 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రం నుంచి సుమారు 50 మంది వరకు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు.

వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ టూరిస్ట్ ప్రదేశాలతో పాటుగా.. ప్రాచీన ప్రాచుర్యం కలిగిన ప్రదేశాలను విదేశీయులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విదేశీ ప్రతినిధులకు అర్థమయ్యే భాషలో తెలిపేందుకు ట్రాన్స్ లేటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్​ ఏ.మల్లికార్జున మాట్లాడుతూ జీ -20 సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 8 జిల్లా కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు స్టేట్ లెవెల్ కమిటీలతో అనుబంధంగా పని చేస్తాయన్నారు. జిల్లాలో ప్రముఖంగా 10 టూరిస్ట్ ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. పోర్టు, నేవీ అధికారుల సహకారంతో జీ -20 సదస్సు ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. పోలీస్ పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షంచడంతో పాటు రెండు రోజుల పాటు వారు పర్యటించే ప్రాంతాలలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన భద్రతను కల్పించనున్నట్లు పోలీస్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.