విశాఖలో 57వ జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. దాదాపు 3,700ల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. హాకీలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. పోటీలను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు, క్రీడాకారులతో వుడా పార్కులో సందడి వాతావరణం నెలకొంది. వచ్చినవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో మూడురోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి.
ఇవీ చదవండి..