శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేట గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు.. ప్రమాదం గురించి తెలుసుకొని కారులోంచి దిగి చూశారు. రక్తపుమడుగులో పడి ఉన్న అతన్ని తక్షణ వైద్యం కోసం తన వాహనంలో టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అతడు తుదిశ్వాస విడిచాడు. మృతుడు హనుమంతు నాయుడుపేట గ్రామానికి చెందిన గిన్ని హేమారావుగా గుర్తించారు. ఈ క్రమంలో మంత్రి చొరవను పలువురు కొనియాడారు.
ఇదీ చదవండి..
CBN: 'వైకాపా పాలనలో వారికి అన్యాయం..అక్రమ కేసులతో వేధింపులు'