ETV Bharat / state

క్షతగాత్రుడికి మంత్రి అప్పలరాజు సాయం... అయినా దక్కని ప్రాణం

author img

By

Published : Aug 19, 2021, 8:29 PM IST

పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో పడివున్న ఓ వ్యక్తిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

minister appala raju
మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేట గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు.. ప్రమాదం గురించి తెలుసుకొని కారులోంచి దిగి చూశారు. రక్తపుమడుగులో పడి ఉన్న అతన్ని తక్షణ వైద్యం కోసం తన వాహనంలో టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అతడు తుదిశ్వాస విడిచాడు. మృతుడు హనుమంతు నాయుడుపేట గ్రామానికి చెందిన గిన్ని హేమారావుగా గుర్తించారు. ఈ క్రమంలో మంత్రి చొరవను పలువురు కొనియాడారు.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేట గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు.. ప్రమాదం గురించి తెలుసుకొని కారులోంచి దిగి చూశారు. రక్తపుమడుగులో పడి ఉన్న అతన్ని తక్షణ వైద్యం కోసం తన వాహనంలో టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అతడు తుదిశ్వాస విడిచాడు. మృతుడు హనుమంతు నాయుడుపేట గ్రామానికి చెందిన గిన్ని హేమారావుగా గుర్తించారు. ఈ క్రమంలో మంత్రి చొరవను పలువురు కొనియాడారు.

ఇదీ చదవండి..

CBN: 'వైకాపా పాలనలో వారికి అన్యాయం..అక్రమ కేసులతో వేధింపులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.