ETV Bharat / state

మావోయిస్టులపై గ్రామస్థులు దాడి.. ఒకరి మృతి - maoists are attacked by villagers andhra odisha border

ఆంద్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని చిత్ర‌కొండ బ్లాక్ ప‌రిధిలో మావోయిస్టులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. జొడొంబో పంచాయ‌తీ జంతురాయ్ గ్రామానికి... శ‌నివారం రాత్రి ముగ్గురు సాయుధ మావోయిస్టులు వ‌చ్చారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని త‌మ‌తో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామ‌స్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల‌కు, గ్రామ‌స్థుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు రాళ్లు రువ్వగా... ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయ‌ప‌డిన మావోయిస్టును మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

maoists are attacked by villagers at andhra odisha border
మావోయిస్టులపై దాడి చేసిన గ్రామస్థులు
author img

By

Published : Jan 26, 2020, 2:13 PM IST

ఇదీ చదవండి:

Intro:AP_VSP_56_26_AOB_LO_MAOIST_LA_PAI_GRAMASTULU_DAADI_AV_AP10153Body:ఆంద్రా-ఒడిశా ప‌రిధిలో మావోయిస్టుల‌ను ప్ర‌తిఘ‌టించిన గ్రామ‌స్థులు, మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు దాడి చేయ‌డంతో ఈ సంఘ‌ట‌న‌లో ఒక మావోయిస్టు మృతిచెంద‌గా, మ‌రొక మావోయిస్టుకు తీవ్ర‌గాయాల‌య్యాయి.దీనికి సంబందించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని చిత్ర‌కొండ బ్లాక్ ప‌రిధిలోని జొడొంబో పంచాయ‌తీ జంతురాయ్ గ్రామానికి శ‌నివారం రాత్రి స‌మ‌యంలో ముగ్గురు సాయుధ మావోయిస్టులు వ‌చ్చారు. గ్రామానికి చెందిన ఒక గిరిజ‌నుడ్ని త‌మ‌తోబాటు తీసుకెల్ల‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ ప్ర‌య‌త్నాన్ని గ్రామ‌స్థులు అడ్డుకున్నారు. ఈ స‌మ‌యంలో మావోయిస్టుల‌కు గ్రామ‌స్తుల‌కు మ‌ద్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు రాళ్లు దాడిజ‌ర‌ప‌గా ఒక మావోయిస్టు అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. మిగ‌తా వారిలో ఒక‌రు సంఘ‌ట‌నాస్థ‌లంలో మృతిచెంద‌గా, మ‌రొక‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన మావోయిస్టును మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.Conclusion:M Ramanarao,9440715742

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.