ఓ పక్క ఆంధ్ర గ్రేహౌండ్స్ బలగాల వరుస దాడులను ఎదుర్కుంటునే.. మావోయిస్టులు అమరవీరల వారోత్సవాలు జరుపుకున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు, ఏవోబీ సమీపంలో ఉన్న ఆండ్రాపల్లి పంచాయతి కొడియాగంది గ్రామంలో మావోలు అమరవీరుల వారోత్సవాలు జరిపినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది గిరిజనులు సైతం పాల్గొన్నట్లు సమాచారం.
వారోత్సవాలు జరపబోమని తులగువరం, తుండపొదర్, కొజురిగుడ, సురిపడ తదితర గ్రామాల్లో.. మావోయిస్టుల స్తూపాలకు స్థానిక మిలిషియా సభ్యులు రంగులు పూసి, ఎర్ర జెండాలతో అలంకరించారు.
వారోత్సవాల సందర్భంగా, మావోయిస్టులు కోయ భాషలో పాటల ఆడియోను విడుదల చేశారు. ఇప్పటికే ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో బలగాలతో ఎదురు కాల్పులు జరిగిన తరువాత కూడా వారోత్సవాలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో కి'లేడీ' వైద్యురాలు