ETV Bharat / state

Low Temperatures in Manyam: విశాఖలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ప్రజలు

author img

By

Published : Jan 28, 2022, 8:48 AM IST

Low Temperatures in Manyam: విశాఖ మన్యంలో చలి పంజా విసురుతోంది. పాడేరు, మినుములూరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Low Temperatures in vishaka Manyam
విశాఖలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు


Low Temperatures in Manyam: విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. పాడేరులో 10.12 డిగ్రీలు, మినుములూరులో 9.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలితో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

తెలంగాణలో కనిష్ట ఉష్టోగ్రతలు..

Temperatures dropped: మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రావడంలేదు. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలా ప్రాంతాల్లో రాత్రి షెడ్లు లేకపోవడంతో పుట్ పాత్​లపైనే నిద్రిస్తున్నారు. ఇలా పుట్ పాత్​లపై పడుకునేవారు.. రగ్గులు కప్పుకున్నప్పటికీ చిగురుటాకులా వణికిపోతున్నారు. తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ప్రయాణ ప్రాంగణాల్లో ప్రయాణికులు చలికి వణికిపోతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో తెల్లవారుజామున 3గంటలకు ప్రయాణం చేయాల్సిన వారు ముందే వచ్చి రైల్వే స్టేషన్లలో పడుకుంటున్నారు. రాత్రిళ్లు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో అర్ధరాత్రి వరకే స్టేషన్లకు వచ్చి స్టేషన్లలోనే పడుకుంటున్నారు. దీంతో ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లలో కూడా ప్రయాణికులు రాత్రిళ్లు చలికి వణికిపోతున్నారు.

అత్యల్పంగా అర్లి(టీ)లో..

గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి (టీ)లో 7.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, వనపర్తి జిల్లాలోని కనైపల్లిలో 34.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వరంగల్​లో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత, హనుమకొండలో 15.2 డిగ్రీలు, మహబూబ్​నగర్​లో 15.5డిగ్రీలు, నాగర్​కర్నూల్​లో 15.9 డిగ్రీలు, మహబూబాబాద్ లో 15.9 డిగ్రీలు, ఖమ్మంలో 16.5 డిగ్రీలు, సూర్యాపేటలో 16.6 డిగ్రీలు, నల్గొండలో 16.9 డిగ్రీలు, హైదరాబాద్​లో 17.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

నాటుబాంబు పేలి.. శునకం మృతి


Low Temperatures in Manyam: విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. పాడేరులో 10.12 డిగ్రీలు, మినుములూరులో 9.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలితో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

తెలంగాణలో కనిష్ట ఉష్టోగ్రతలు..

Temperatures dropped: మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రావడంలేదు. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలా ప్రాంతాల్లో రాత్రి షెడ్లు లేకపోవడంతో పుట్ పాత్​లపైనే నిద్రిస్తున్నారు. ఇలా పుట్ పాత్​లపై పడుకునేవారు.. రగ్గులు కప్పుకున్నప్పటికీ చిగురుటాకులా వణికిపోతున్నారు. తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ప్రయాణ ప్రాంగణాల్లో ప్రయాణికులు చలికి వణికిపోతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో తెల్లవారుజామున 3గంటలకు ప్రయాణం చేయాల్సిన వారు ముందే వచ్చి రైల్వే స్టేషన్లలో పడుకుంటున్నారు. రాత్రిళ్లు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో అర్ధరాత్రి వరకే స్టేషన్లకు వచ్చి స్టేషన్లలోనే పడుకుంటున్నారు. దీంతో ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లలో కూడా ప్రయాణికులు రాత్రిళ్లు చలికి వణికిపోతున్నారు.

అత్యల్పంగా అర్లి(టీ)లో..

గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి (టీ)లో 7.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, వనపర్తి జిల్లాలోని కనైపల్లిలో 34.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వరంగల్​లో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత, హనుమకొండలో 15.2 డిగ్రీలు, మహబూబ్​నగర్​లో 15.5డిగ్రీలు, నాగర్​కర్నూల్​లో 15.9 డిగ్రీలు, మహబూబాబాద్ లో 15.9 డిగ్రీలు, ఖమ్మంలో 16.5 డిగ్రీలు, సూర్యాపేటలో 16.6 డిగ్రీలు, నల్గొండలో 16.9 డిగ్రీలు, హైదరాబాద్​లో 17.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

నాటుబాంబు పేలి.. శునకం మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.