విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారద నదిపై శిథిలావస్థలో ఉన్న కాలిబాటపై గుంతలో రేషన్ సరకులతో లారీ కూరుకుపోయింది. అనంతగిరి మండలంలోని లారీ పక్కకు ఒరిగిపోయి కొన్ని సరుకులు నదిలో పడిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడిన స్థానికులు సరుకులు పట్టుకున్నారు. కాలిబాటపై లారీ కూరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గంటల తర్వాత ప్రోక్లెయిన్ సాయంతో లారీని బయటకు లాగారు. పెను ప్రమాదం నుంచి బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాలిబాట మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి. అచ్చెన్న త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు