విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ డైమండ్ పార్కు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన లారీ చెట్టును ఢీకొట్టింది. క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. సోమవారం రాత్రి నుంచి రోడ్డుకు అడ్డంగా ఆగిపోయిన లారీని పోలీసులు జేసీబీతో తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. ఉదయం అంబులెన్స్లో తీవ్రగాయాల పాలైన క్లీనర్ను పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ మహారాష్ట్రకు చెందినదిగా గుర్తించారు.
ఇవీ చదవండి: విశాఖ మన్యం: జీవో నెంబర్ 3 అమలు చేయాలంటూ గిరిజనుల ఆందోళన