ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది చేతివాటం.. నలుగురిపై వేటు - విశాఖలో ప్రభుత్వ మద్యం దుకాణాలు

విశాఖ నగరంలోని మల్కాపురం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి దాదాపు వెయ్యికిపైగా మద్యం సీసాలు బ్లాక్ మార్కెట్​కు చేరాయి. దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది వీటిని అక్రమంగా తరలించారు. ఈ ఘటనలో నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు.

liquor illegal sales in malkapuram vizag district
చేతివాటం ప్రదర్శించిన నలుగురు ఉద్యోగులు
author img

By

Published : Jul 1, 2020, 8:34 AM IST

విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారు. నగరంలోని మల్కాపురం హెచ్​పీసీఎల్ గేట్ ఎదురుగా ఉన్న దుకాణంలో సిబ్బంది మద్యం సీసాలను అక్రమంగా తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణంలోని సిబ్బంది సీసాలపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు తీసివేసి దాదాపు 1,080 మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్​కి తరలించారు. వాటి విలువ సుమారు లక్షా 90 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు.

విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారు. నగరంలోని మల్కాపురం హెచ్​పీసీఎల్ గేట్ ఎదురుగా ఉన్న దుకాణంలో సిబ్బంది మద్యం సీసాలను అక్రమంగా తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణంలోని సిబ్బంది సీసాలపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు తీసివేసి దాదాపు 1,080 మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్​కి తరలించారు. వాటి విలువ సుమారు లక్షా 90 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు.

ఇవీ చదవండి...

'ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన కరోనా లేనట్టు కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.