ఈశాన్య రాష్ట్రం మిజోరం 15వ గవర్నర్గా కంభంపాటి హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గువాహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోథాన్ ఖుమా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. వాస్తవానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుదాంసుదులియా ప్రమాణం చేయించాల్సి ఉంది.
అయితే ఆయన కుటుంబ సభ్యులు కరోనా బాధ పడుతున్న నేపథ్యంలో ఆబాధ్యతలను మిజోరం రాజధాని ఐజ్వాల్ ఉన్న న్యాయమూర్తి మైఖేల్ జోథాన్ ఖుమాకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మిజోరం ముఖ్యమంత్రి జోరందంగా, మంత్రులు, అధికారులు, కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ, ఆయన కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: