ETV Bharat / state

కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త

author img

By

Published : Jul 31, 2020, 11:53 PM IST

ఇటీవల కురిసిన వర్షాలకు విశాఖలోని తాండవ, కోనాం జలాశయాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఖరీప్ సీజన్​కు నీటిని విడుదల చేయుటకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేఫథ్యంలో రైతన్నలు వరినాట్లకు సిద్దమౌతున్నారు. ఆగస్టు రెండున కోనాం జలాశయం ఆయకట్టు రైతులకు, ఐదున తాండవ జలాశయం ఆయకట్టు ప్రాంత రైతులకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!
కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!

కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!
కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!

విశాఖపట్నం జిల్లా తాండవ జలాశయం నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్​కు సంబంధించి అధికారులు నీటి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆగస్టు నెల 5న ఖరీఫ్ సీజన్​కు నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జల వనరుల శాఖ అధికారులు ప్రకటించారు. విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం కింద విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 52 వేల ఎకరాలు సాగవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 376 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్ సీజన్​కు నీటిని విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్తామని జలవనరుల శాఖ డిఈ రాజేంద్ర కుమార్ తెలిపారు.

కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!
కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!

వరినాట్లకు సిద్దమౌతున్న రైతులు

కోనాం (పాలవెల్లి) మధ్యతరహా జలాశయం ఆయకట్టు రైతులకు అధికారులు శుభవార్త చెప్పారు. వరినాట్లకు ఆగస్టు రెండో తేదీన సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, కోనాం జలాశయ సాగునీటి కమిటీ చైర్మన్ గండి ముసలినాయుడు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో అన్నదాతలు వరినాట్లకు సిద్ధం అవుతున్నారు.

కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!
కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!

ఇవీ చదవండి

కరోనా వేళ...వరలక్ష్మీ దేవికీ మాస్క్!

కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!
కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!

విశాఖపట్నం జిల్లా తాండవ జలాశయం నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్​కు సంబంధించి అధికారులు నీటి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆగస్టు నెల 5న ఖరీఫ్ సీజన్​కు నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జల వనరుల శాఖ అధికారులు ప్రకటించారు. విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం కింద విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 52 వేల ఎకరాలు సాగవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 376 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్ సీజన్​కు నీటిని విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్తామని జలవనరుల శాఖ డిఈ రాజేంద్ర కుమార్ తెలిపారు.

కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!
కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!

వరినాట్లకు సిద్దమౌతున్న రైతులు

కోనాం (పాలవెల్లి) మధ్యతరహా జలాశయం ఆయకట్టు రైతులకు అధికారులు శుభవార్త చెప్పారు. వరినాట్లకు ఆగస్టు రెండో తేదీన సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, కోనాం జలాశయ సాగునీటి కమిటీ చైర్మన్ గండి ముసలినాయుడు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో అన్నదాతలు వరినాట్లకు సిద్ధం అవుతున్నారు.

కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!
కోనాం, తాండవ ఆయకట్టు రైతులకు శుభవార్త..!

ఇవీ చదవండి

కరోనా వేళ...వరలక్ష్మీ దేవికీ మాస్క్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.