ఏప్రిల్ ఆరు నుంచి ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్ర ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్రను ఐ.ఆర్.సి.టి.సి ప్రతి ఏడాది నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 16వ తేదీ వరకు ఈ యాత్ర ఉంటుందని సంబంధిత విభాగ విశాఖ ప్రాంత కన్వీనర్ చంద్రమోహన్ తెలిపారు. ఈ ప్యాకేజీలో ఐదు జ్యోతిర్లింగాలతో పాటు షిరిడి సాయిబాబా దర్శనం చేయించి.. భక్తులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తామని ఆయన తెలిపారు. ఒక్కొక్కరికి రూ.11,445 టికెట్ ధరను ఐఆర్సీటీసీ నిర్ణయించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో రైలు ఆగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి.మా భూములిచ్చే ప్రసక్తే లేదు : రైతులు