ETV Bharat / state

ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన

author img

By

Published : Feb 17, 2021, 8:33 PM IST

జీవిత బీమా సంస్థ (ఎల్​ఐసీ)ని బలహీనపరిచే ఏ చర్యనైనా తిప్పికొడతామని.. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి సి.ఎన్. రమణాచలం స్పష్టం చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో విశాఖ ఎల్ఐసీ భవనం వద్ద క్లాస్ 3,4 ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఎల్​ఐసీ  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
ఎల్​ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..

స్టాక్ మార్కెట్ జాబితాలో 2021-22 సంవత్సరంలో ఎల్​ఐసీని చేర్చటంపై ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి సి.ఎన్. రమణాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్​ఐసీలో విదేశీ పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని, 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించటాన్ని వ్యతిరేకించారు. ప్రజలకు, దేశానికి ఎల్​ఐసీ ఎంత అవసరమో తెలియజేస్తూ.. పోరాటం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

స్టాక్ మార్కెట్ జాబితాలో 2021-22 సంవత్సరంలో ఎల్​ఐసీని చేర్చటంపై ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి సి.ఎన్. రమణాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్​ఐసీలో విదేశీ పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని, 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించటాన్ని వ్యతిరేకించారు. ప్రజలకు, దేశానికి ఎల్​ఐసీ ఎంత అవసరమో తెలియజేస్తూ.. పోరాటం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో... 'వాల్తేరు' అనుబంధం తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.