విశాఖ జిల్లా పెద్దిపాలంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పొందిన భీమిలి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సబ్బం హరి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు కార్యకర్తలెవరూ...ఆధైర్యపడవద్దని సూచించారు. ఎన్నకలో గెలుపోటములు సహజమేనని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. వచ్చే ఐదేళ్లుగా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యనించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జీవీఎంసీ, పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.
ఇదీచదవండి