విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుజరాత్లో బీఎస్ఎఫ్ ఎస్సైగా పనిచేస్తోన్న కె శ్రీనివాసరావు సెలవు నిమిత్తం అనకాపల్లి వచ్చారు. తల్లిదండ్రులతో కలిసి అన్నవరం వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వెనుక భాగం నుంచి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలోని నలభై రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు అపహరించినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా అదనపు క్రైమ్ ఎస్పీ అచ్యుతరావు పరిశీలించారు. క్లూస్ టీం పోలీసులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కర్ రావు తెలిపారు.
ఇదీ చూడండి: