విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగడ - డుడుమా జలపాతం రోడ్డుపై బండరాళ్లు దొర్లి రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ఈ దారి నుంచే ప్రజలు పనస, గతురుముండా, దొరగుడా, ఒనకడిల్లి, మాచకుండ్, లమతపుట్టు గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. విద్యార్థులు రోజు 2కిలోమీటర్లు నడుచుకుంటూ సంగడ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి...చిట్టడవులు@ఇమ్పోర్ట్ ఫ్రమ్ జపాన్