విశాఖ జిల్లా నర్సీపట్నం మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాదికి సంబంధించి మార్కెట్ యార్డ్ తో పాటు.. నాతవరం లోనూ మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. నర్సీపట్నం మార్కెట్ యార్డ్ లోనే నేటి వరకు 150 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. వాతావరణం ఆశాజనకంగా లేని కారణంగా.. వరికుప్పలను తక్షణమే నూర్పిడి చేసి ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు.