ETV Bharat / state

వాల్తేరు రైల్వే డివిజన్​ కొనసాగించాలని మహా ధర్నా

author img

By

Published : Aug 21, 2019, 11:13 PM IST

వాల్తేరు రైల్వే డివిజన్​ను కొనసాగించాలని డిమాండ్​ చేస్తూ..తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్​ యూనియన్​ ఆధ్వర్యంలో విశాఖలో ధర్నా చేపట్టారు.

వాల్తేరు రైల్వే డివిజన్​ కొనసాగించాలని మహా ధర్నా
వాల్తేరు డివిజన్​ కావాలి..!

వాల్తేరు రైల్వే డివిజన్​ను కొనసాగించాలని డిమాండ్​ చేస్తూ..తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్​ యూనియన్​ విశాఖపట్నంలో ధర్నా చేసింది. అతి పురాతన డివిజన్లలో ఒకటైన వాల్తేర్​ను ఎత్తివేయటమేంటని నాయకులు ప్రశ్నించారు. అనేక సార్లు నిరసనలు చేసినా..రైల్వే శాఖ స్పందించనందుకే ఈ మహా ధర్నా చేపట్టామని వెల్లడించారు. తమ డిమాండ్లను డీఆర్​ఎం చేతన్​ శ్రీవాస్తవకు లేఖ రూపంలో సమర్పించారు. అధికారులు తమ నిర్ణయాన్ని పునః సమీక్షించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వాల్తేరు డివిజన్​ కావాలి..!

వాల్తేరు రైల్వే డివిజన్​ను కొనసాగించాలని డిమాండ్​ చేస్తూ..తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్​ యూనియన్​ విశాఖపట్నంలో ధర్నా చేసింది. అతి పురాతన డివిజన్లలో ఒకటైన వాల్తేర్​ను ఎత్తివేయటమేంటని నాయకులు ప్రశ్నించారు. అనేక సార్లు నిరసనలు చేసినా..రైల్వే శాఖ స్పందించనందుకే ఈ మహా ధర్నా చేపట్టామని వెల్లడించారు. తమ డిమాండ్లను డీఆర్​ఎం చేతన్​ శ్రీవాస్తవకు లేఖ రూపంలో సమర్పించారు. అధికారులు తమ నిర్ణయాన్ని పునః సమీక్షించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి

వాల్తేరు రైల్వే డివిజన్ కోసం..ఉద్యోగుల ఉద్యమం

కడప జిల్లా వేంపల్లి మండలం ఉదయం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అభివృద్ధిపై సమీక్ష సమావేశం .ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మరియు పులివెందుల ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డి వైయస్సార్ మండల ఇన్చార్జి మాజీ ఎంపీపీ రవి కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు మండలంలోని 16 గ్రామ పంచాయతీలు గ్రామాలలో ఉన్న సమస్యలను అన్నింటినీ ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా సిసి రోడ్లు డ్రైనేజీ సీట్ లైట్లు తాగునీరు సాగునీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో వర్షాలు లేకపోవడంతో త్రాగునీటి సమస్య అధిగమించి దిశగా చర్యలు చేపట్టాలని ఎంపీ అధికారులను సూచించారు. ప్రజల తమ సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి మండల స్థాయిలో పరిష్కరించే వాటిని అక్కడే పరిష్కారం చూపారు. మిగతా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం జరిగేలా కృషి చేస్తానని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు ప్రజలు అందరూ పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.