తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో భవనాలను అందించడంలో... వైకాపా ప్రభుత్వ తీరుకు నిరసనగా సీపీఎం నేతలు ధర్నా చేపట్టారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ గృహాలను వెంటనే అందించాలని, లేకుంటే పార్టీ తరఫున ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తికి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: