ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వం తన ఇష్టానుసారంగా దాడులకు పాల్పడిందని భాజాపా నేత, మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఇన్ని రోజులుగా దాడులు, ఘర్షణలు జరుగుతున్నా పోలీస్ శాఖ, ఎన్నికల కమిషన్ స్పందించక పోవడం వల్ల వైకాపా కార్యకర్తలు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు మందలిస్తే గాని ప్రభుత్వ వ్యవస్థలు దారికి రాకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను రద్దు చేసి మరలా కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
ఇవీ చదవండి...'స్థానికం'లో జిల్లాలకు జిల్లాలే వైకాపా పరం