ETV Bharat / state

కల్వర్టును ఢీకొని కొండవాగులో పడిన ఆటో... ఐదుగురికి గాయాలు

author img

By

Published : Aug 18, 2020, 7:44 PM IST

విశాఖ ఏజెన్సీలో అదుపుతప్పిన ఆటో కొండవాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు రైతులకు గాయాలయ్యాయి. వీరిని తాజంగి ఆసుపత్రికి తరలించారు.

auto rolled down after hitting culvert in visakha agency
బురిసింగి- మామిడిపల్లి మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం

ఆటో అదుపుతప్పి కొండవాగులో పడిన ఘటన విశాఖ ఏజెన్సీలో జరిగింది. చింతపలల్లి మండలం తాజంగికి చెందిన రైతులు శనగకాయల బస్తాలను ఆటోలో వేసి... లోతుగడ్డు సంతకు బయలుదేరారు. ఘాటీ దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పింది.

బురిసింగి- మామిడిపల్లి మధ్య కల్వర్టును ఢీకొని కొండవాగులో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాజంగి ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ప్రాణ నష్టం తప్పడంపై రైతులు ఊపిరిపీల్చుకున్నారు.

ఆటో అదుపుతప్పి కొండవాగులో పడిన ఘటన విశాఖ ఏజెన్సీలో జరిగింది. చింతపలల్లి మండలం తాజంగికి చెందిన రైతులు శనగకాయల బస్తాలను ఆటోలో వేసి... లోతుగడ్డు సంతకు బయలుదేరారు. ఘాటీ దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పింది.

బురిసింగి- మామిడిపల్లి మధ్య కల్వర్టును ఢీకొని కొండవాగులో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాజంగి ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ప్రాణ నష్టం తప్పడంపై రైతులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

రెండు లారీలు ఢీ.. ఇద్దరి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.