విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ పెదబయలు మండలం పన్నెడ కూడలి వద్ద ఆగివున్న ఆటోను ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ జిల్లా పాడేరు ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమించడంతో వైజాగ్లోని కేజీహెచ్కు తరలించారు. ఆటోలో రెండు నెలల పసిపాప ఉంది. అయితే.. ఆమెను గట్టిగా పట్టుకుని ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి:శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం