ETV Bharat / state

కొవిడ్ రోగుల‌ కోసం మరో ముందడుగు వేసిన ఉక్కు కర్మాగారం

author img

By

Published : May 1, 2021, 4:21 AM IST

కొవిడ్ రోగుల‌కు సేవ‌లందించేందుకు విశాఖ ఉక్కు........ అంతర్గత వ‌న‌రుల‌తో మౌలిక స‌దుపాయాల కల్పనకు పూనుకుంది. వెయ్యి ప‌డ‌క‌ల కోవిడ్ కేర్ ఆసుప‌త్రికి స‌దుపాయం క‌ల్పించేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

కొవిడ్ రోగుల‌ కోసం మరో ముందడుగు వేసిన ఉక్కు కర్మాగారం
కొవిడ్ రోగుల‌ కోసం మరో ముందడుగు వేసిన ఉక్కు కర్మాగారం
కొవిడ్ రోగుల‌ కోసం మరో ముందడుగు వేసిన ఉక్కు కర్మాగారం

జాతి సంపదకు నెలవైనది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం.... యావత్‌ దేశం కోవిడ్‌తో అల్లాడుతున్న తరుణంలో ఉక్కు సంకల్పంతో... తమ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా చికిత్స అందించేందుకు వెయ్యి పడకలు సిద్ధం చేస్తోంది. తమ అంతర్గత నిధులతో వెయ్యి పడకలను విశాఖ ఉక్కు ఇనుముతో.... యుద్ద ప్రాతిపదికన త‌యారు చేస్తోంది.కేంద్ర ఉక్కుశాఖమంత్రితో జ‌రిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వెయ్యి ప‌డ‌క‌లకు ఆక్సిజెన్ స‌ర‌ఫ‌రా కోసం....మౌలిక స‌దుపాయాల కల్పన శ‌రవేగంగా జరగుతోంది.

ఉక్కు నగరంలో ఉన్న వేర్వేరు సామాజిక కేంద్రాల‌ు......పలు హాళ్లను కోవిడ్ బాధితుల‌కు చికిత్స అందించేందుకు తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే.... స్టీల్‌ప్లాంట్ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలో 110 ప‌డ‌క‌ల‌ను పూర్తిగా కొవిడ్ రోగులకు కేటాయించి.... చికిత్స అందిస్తున్నారు.

ఆక్సిజెన్ కొర‌త‌తో ఇప్పుడు దేశ‌మంతా స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌రుణంలో ఆక్సిజెన్ స‌ర‌ఫ‌రా కోసం విశాఖ ఉక్క ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 13 వ‌ర‌కు 2వేల 200 ట‌న్నుల లిక్విడ్ మెడిక‌ల్ అక్సిజెన్‌ను స‌ర‌ఫ‌రా చేసింది. ఇందులో..అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌కి, వంద ట‌న్నుల మేర ఆక్సిజెన్ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా మ‌హ‌రాష్ట్రకు పంపింది.

ఇవీ చదవండి

'మీరు వైద్య వృత్తిలో ఉన్నారు... ప్రాణాల మీద డబ్బులు సంపాదించకండి'

కొవిడ్ రోగుల‌ కోసం మరో ముందడుగు వేసిన ఉక్కు కర్మాగారం

జాతి సంపదకు నెలవైనది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం.... యావత్‌ దేశం కోవిడ్‌తో అల్లాడుతున్న తరుణంలో ఉక్కు సంకల్పంతో... తమ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా చికిత్స అందించేందుకు వెయ్యి పడకలు సిద్ధం చేస్తోంది. తమ అంతర్గత నిధులతో వెయ్యి పడకలను విశాఖ ఉక్కు ఇనుముతో.... యుద్ద ప్రాతిపదికన త‌యారు చేస్తోంది.కేంద్ర ఉక్కుశాఖమంత్రితో జ‌రిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వెయ్యి ప‌డ‌క‌లకు ఆక్సిజెన్ స‌ర‌ఫ‌రా కోసం....మౌలిక స‌దుపాయాల కల్పన శ‌రవేగంగా జరగుతోంది.

ఉక్కు నగరంలో ఉన్న వేర్వేరు సామాజిక కేంద్రాల‌ు......పలు హాళ్లను కోవిడ్ బాధితుల‌కు చికిత్స అందించేందుకు తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే.... స్టీల్‌ప్లాంట్ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలో 110 ప‌డ‌క‌ల‌ను పూర్తిగా కొవిడ్ రోగులకు కేటాయించి.... చికిత్స అందిస్తున్నారు.

ఆక్సిజెన్ కొర‌త‌తో ఇప్పుడు దేశ‌మంతా స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌రుణంలో ఆక్సిజెన్ స‌ర‌ఫ‌రా కోసం విశాఖ ఉక్క ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 13 వ‌ర‌కు 2వేల 200 ట‌న్నుల లిక్విడ్ మెడిక‌ల్ అక్సిజెన్‌ను స‌ర‌ఫ‌రా చేసింది. ఇందులో..అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌కి, వంద ట‌న్నుల మేర ఆక్సిజెన్ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా మ‌హ‌రాష్ట్రకు పంపింది.

ఇవీ చదవండి

'మీరు వైద్య వృత్తిలో ఉన్నారు... ప్రాణాల మీద డబ్బులు సంపాదించకండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.